ఆ విషయంలో తెలంగాణ దేశంలోనే టాప్!

by Disha Web Desk 2 |
ఆ విషయంలో తెలంగాణ దేశంలోనే టాప్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల కోసం అత్యధికంగా ఖర్చు చేసే రాష్ట్రాలలో తెలంగాణ దేశంలోనే ముందువరుసలో ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి అన్నారు. ఎన్నికలలో రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ తర్వాత లిక్కర్ ప్రభావం తీవ్రంగా ఉందని అందువల్ల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక లెక్కలు చూపకుండా 25 వేల కంటే ఎక్కువ డబ్బు తీసుకువెళ్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలింగ్, కౌంటింగ్ రోజు మాత్రమే మద్యం షాపులు బంద్ పెడుతున్నారని అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే లిక్కర్ షాపులను బంద్ చేయాలని అన్నారు. హైదరాబాద్ లక్డీకపూల్ లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఓటును అమ్ముకోవద్దని సూచించారు.



Next Story

Most Viewed