సీపీఎం సంచలన ప్రకటన.. 17 స్థానాల్లో పోటీ

by Disha Web Desk 2 |
సీపీఎం సంచలన ప్రకటన.. 17 స్థానాల్లో పోటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీతో పొత్తుల విషయంలో సీపీఎం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తు అంశంపై ఇవాళ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ నిన్న భట్టి విక్రమార్క మాకు ఫోన్ చేసిన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అయితే ఇవాళ ఉదయం వరకు ఎదురు చూశాం. తామిచ్చిన డెడ్ లైన్ ముగియడంతో అనివార్య పరిస్థితుల్లో విడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ మేరకు తాము 17 స్థానాల్లో పోటీ చేస్తామని తమ్మినేని వెల్లడించారు. భద్రాచలం (ఎస్టీ), అశ్వరావుపేట(ఎస్టీ), పాలేరు, మధిర(ఎస్సీ), వైరా(ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి(ఎస్సీ), మిర్యాలగూడెం, నల్లగొండ, నకిరేకల్(ఎస్సీ), భువనగిరి, హుజూర్‌నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు..




Next Story

Most Viewed