TS: చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌కు విపక్షాల వినతి

by Disha Web Desk 2 |
TS: చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌కు విపక్షాల వినతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని ఈనెల 14 అఖిలపక్ష పార్టీల రాస్తారోకోను నిర్వహించనున్నట్లు అఖిలపక్ష పార్టీలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే రాస్తారోకో పర్మిషన్ కోరుతూ తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌కు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ వైఫల్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకు పోయాయన్నారు.

ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 14న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు ఇచ్చాయని తెలిపారు.



Next Story

Most Viewed