ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు.. డీజీపీతో మాట్లాడుతా: కేటీఆర్

by Disha Web Desk 2 |
ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు.. డీజీపీతో మాట్లాడుతా: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాలరాజు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఉద్యమ కాలంలో ఇలాంటి ఎన్నో దాడులను ఎదుర్కొని తెలంగాణ పోరాడిన నాయకుడు బాలరాజు అని కొనియాడారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరేనని, మళ్లీ ఇంతకింత అనుభవించాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర డీజీపీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతానని తెలిపారు.

Next Story

Most Viewed