తెలంగాణలో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు వీళ్లే!

by Disha Web Desk 2 |
తెలంగాణలో అత్యంత ధనిక ఎమ్మెల్యేలు వీళ్లే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఓవైపు బతుకమ్మ, దసరా ఉత్సవాలు, మరోవైపు ఎన్నికల హడావుడితో సందడి వాతావరణం చోటుచేసుకుంది. ప్రజలు పండుగ పనుల్లో నిమగ్నమైపోగా.. రాజకీయ నాయకులు ప్రచారం షురూ చేశారు. ఈ సమయంలో ధనిక ఎమ్మెల్యేల జాబితాను ఏడీఆర్ రిపోర్ట్ విడుదల కావడం కలకలం రేపుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ధనిక ఎమ్మెల్యేల వివరాలు సేకరించారు.

ఈ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో అత్యంత ధనికుడైన ఎమ్మెల్యేల జాబితాతో మొదటి స్థానంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి(రూ.161 కోట్లు) ఉండగా.. రెండో స్థానంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి(రూ.91 కోట్లు) ఉన్నారు. ఆ తర్వాత భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(రూ.91 కోట్లు) ఉన్నారు. ఇక పేద ఎమ్మెల్యేల జాబితాలో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా (రూ.22 లక్షలు), చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (రూ.20 లక్షలు), అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు(రూ.27 లక్షలు) ఉన్నారు.


Next Story

Most Viewed