వేముల వీరేశం గెలుపుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
వేముల వీరేశం గెలుపుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నల్లగొండ కాంగ్రెస్ ముఖ్య నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. అనంతరం కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. నకిరేకల్‌‌లో వీరేశం గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో వీరేశం‌ను గెలిపిస్తే తనకు ముఖ్యమంత్రి అయినంత సంతోషంగా ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. గతంలో కాంగ్రెస్ జెండాపై గెలిచిన వ్యక్తి పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం అయినా ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గలకు 12 నియోజకవర్గాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు.



Next Story

Most Viewed