కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కీలక ప్రకటన

by Disha Web Desk 2 |
కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ రాకతో కామారెడ్డి జిల్లా దశ దిశ మారబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసిన కేసీఆర్ హాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. వచ్చే ఏడాది జనవరిలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల బీమా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెల్లడించారు.

దశల వారీగా పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతామని చెప్పారు. అభివృద్ధియే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తోన్న వారికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఇంకా సినిమా అయిపోలేదు.. కాంగ్రెస్‌, బీజేపీలకు ముందు ముందు మంచి సినిమా చూపిస్తామని కేటీఆర్‌ అన్నారు. ప్రజల మద్దతు లేని కాంగ్రెస్‌ పార్టీ అప్పుడే తాము అధికారంలోకి వస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రమాణ స్వీకారణ డేట్‌లు ఫిక్స్‌ చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed