అందుకే కాంగ్రెస్‌లో చేరా.. తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్

by Disha Web Desk 2 |
అందుకే కాంగ్రెస్‌లో చేరా.. తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్
X

దిశ, ఖమ్మం: ఖమ్మంలో బందిపోట్ల ముఠాను తరమికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరానని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని వీవీ చౌదరి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకే నేను వచ్చానని, మీ పిల్లలు విదేశాలలో ఉంటే మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలని నా కోరిక అని అన్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎంతో భయాందోళనతో జీవనం సాగిస్తున్నారని.. ఆ భయాన్ని పారదోలి ఎందాకైనా మీ వెంట ఉంటానని భరోసా ఇచ్చారు.

నందమూరి తారక రామారావు దేశానికే గర్వకారణంగా నిలిచారని అలాంటి గొప్ప నాయకుడిని ఆశీస్సులతో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రామారావు, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేశానన్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సుమారు 200 కుటుంబాలు తుమ్మల నాగేశ్వరరావు మద్దతు పలికారు. సీనియర్ నాయకులు వాసిరెడ్డి వెంకట వెంకట చౌదరి, బచ్చు మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్, బాలసాని లక్ష్మీనారాయణ, సాదు రమేష్ రెడ్డి, కమర్థపు మురళి, చావ నారాయణరావు, పొట్ల వీరేంద్ర, దీపక్ చౌదరి, జంగం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed