ఆ భయంతోనే కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించారు: Etela Rajender

by GSrikanth |   (  Updated:2023-08-25 06:16:11  IST  )

ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌పై బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆ భయంతోనే కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించారు: Etela Rajender
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌పై బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ వీడుతారన్న భయంతోనే కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నేతలున కొనుగోలు చేసేందుకే ముందే అభ్యర్థులను ప్రకటించారని విమర్శించారు. కాగా, 115 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో నలుగురు కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించారు.

Next Story