పవన్ కళ్యాణ్‌‌పై కాంగ్రెస్ నేత వీహెచ్ సీరియస్ కామెంట్స్

by Disha Web Desk 2 |
పవన్ కళ్యాణ్‌‌పై కాంగ్రెస్ నేత వీహెచ్ సీరియస్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో జనంలోకి వెళ్తున్న బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నికల ముందే బీసీలు గుర్తుకు వచ్చారా? అని నిలదీశారు. ప్రధాని బీసీల ఆత్మగౌరవ సభ వేళ మంగళవారం వీహెచ్ ఈ కామెంట్స్ చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓబీసీ కుల గణన చేపడుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌ను బీజేపీ వాడుకుంటోందని ఆంధ్రకు ప్రత్యేక హోదా కావాలని అడిగిన పవన్ ఇప్పుడు మోడీ పక్కన చేరారని విమర్శించారు. బీసీల గురించి చెబుతూ పవన్ కళ్యాణ్ కాపుకు చెందిన వాడని.. ఓబీసీలకు మోడీ చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలని అన్నారు.

Next Story

Most Viewed