వేణుస్వామిని కలిసిన ఫొటోపై BRS అసభ్యకర ప్రచారం.. ఘాటుగా స్పందించిన రాణి రుద్రమ

by Disha Web Desk 2 |
వేణుస్వామిని కలిసిన ఫొటోపై BRS అసభ్యకర ప్రచారం.. ఘాటుగా స్పందించిన రాణి రుద్రమ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై బీజేపీ నేత రాణి రుద్రమ స్పందించారు. సిరిసిల్లలో రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేక మంత్రి కేటీఆర్ ఇంత నీచస్థాయికి దిగజారిపోతున్నవా? అని ప్రశ్నించారు. నేను తండ్రిలా భావించే వ్యక్తి వద్ద దసరా పండగపూట ఆశీర్వాదం తీసుకుంటే మీ చిల్లర చెంచా గాళ్లతో సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టించిన మీ కుసంస్కారానికి సిరిసిల్ల ప్రజలు బుద్ధిచెబుతారని ఫైర్ అయ్యారు. ఇటీవల రాణి రుద్రమ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వేణు స్వామి పాదాలకు రాణి రుద్రమ నమస్కారం చేస్తున్న ఫోటోను బీఆర్ఎస్‌కు చెందిన ఓ నెటిజన్ అసభ్యంగా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఈ ట్రోలింగ్‌పై గురువారం స్పందించిన రాణి రుద్రమ.. కేటీఆర్‌పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మహిళలపై అరాచకాలు చేసే అవమానించే మీ దొర దురహంకార అధికార మధానికి సిరిసిల్ల మహిళా ఓట్ల రూపంలో సమాధానం చెబుతారని హచ్చరించారు. మహిళలపై ఆకృత్యాలు చేసిన రజాకార్లను, దొరలను తరిమి కొట్టిన తెలంగాణ గడ్డ ఇది. చరిత్రపునరావృత్తం అయితే మీరు దేశాలు దాటి పారిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా బీఆర్ఎస్ కు మాత్రమే లేదని, మా బీజేపీ తలుచుకుంటే మీరంతా గాల్లో కొట్టుకుపోతారని వార్నింగ్ ఇచ్చారు.

Next Story