గోషామహల్‌కు రాజ్ నాథ్ సింగ్.. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

by GSrikanth |

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండ్రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 20, 21 తేదీల్లో ఆయన పర్యటన సాగనుంది.

గోషామహల్‌కు రాజ్ నాథ్ సింగ్.. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండ్రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 20, 21 తేదీల్లో ఆయన పర్యటన సాగనుంది. అయితే, గోషామహల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. గోషామహల్‌లో సభ ఏర్పాటు చేస్తుండగా మరో సభ ఎక్కడ నిర్వహిస్తారనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే, గోషామహల్‌లో ఏ రోజు సభ నిర్వహిస్తారనే అంశంపైనా క్లారిటీ రావాల్సి ఉంది. సభ తేదీల ఖరారుపై రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. త్వరలోనే ఈ సభలకు సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story