పట్నం మహేందర్ రెడ్డికి కేబినెట్‌లో చోటు.. రేపే ప్రమాణస్వీకారం

by Disha Web Desk 2 |
పట్నం మహేందర్ రెడ్డికి కేబినెట్‌లో చోటు.. రేపే ప్రమాణస్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: అందరూ ఊహించిన విధంగానే బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీకి పట్నం మహేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్‌లో అవకాశం కల్పించారు. రేపు కేబినెట్ భేటీ అనంతరం ఉదయం 11:30 గంటలకు మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన జాబితాలో చోటు సంపాదించుకున్న ఎమ్మెల్యేల అభ్యర్థులకు స్థానికత నుంచి కొంత అసమ్మతి, కొంత వ్యతిరేకత సమస్యగా మారనున్నాయి.

ఆ రెండింటినీ ఎదుర్కునేందుకు వారు ఈ సారి తీవ్రంగా కష్టపడక తప్పదనే అభిప్రాయం ఉన్నది. పాజిటివ్ వాతావరణం ఏర్పర్చుకునేందుకు వెంటనే రంగంలోకి దిగాలని సీఎం కేసీఆర్ వారికి ఆదేశించినట్టు తెలుస్తున్నది. అసమ్మతి లీడర్లను స్వయంగా కలిసి సహకారం కోసం అప్పీలు చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి సపోర్ట్ చేయాలని ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందే కేబినెట్‌లో చోటు కల్పిస్తామని పట్నంకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇవ్వడం గమనార్హం.

Next Story