రేపు నా గడ్డం తీసేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Disha Web Desk 2 |
రేపు నా గడ్డం తీసేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: నా మొక్కు రేపటితో తీరుతుందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, నా గడ్డం తీసేస్తానని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఉత్తమ్.. క్యాంపు రాజకీయాల గురించి తనకు తెలియదన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్యాంపు రాజకీయం తప్పేమీ కాదన్నారు. సీఎం ఎవరన్నది అధిష్టానమమే నిర్ణయిస్తుందని, రేపు రిజల్ట్ తర్వాతే తాను ఈ అంశంపై మాట్లాడుతాన్నారు. ఎగ్జిట్ ఫలితాలు తమకు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నదని వ్యక్తిగతంగా తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

Next Story

Most Viewed