ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టండి.. సీఈవోను కోరిన టీ.కాంగ్రెస్ నేతలు

by Disha Web Desk 2 |
ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టండి.. సీఈవోను కోరిన టీ.కాంగ్రెస్ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కాంగ్రెస్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లీస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీని కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మధుయాష్కీ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని డిమాండ్‌ చేశారు. నాలుగు అంశాలపై సీఈవో వికాస్‌రాజ్‌‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైతుబంధు నిధులను మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. భూ రికార్డులు మారుస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌ రికార్డులు మారుస్తున్నారన్నారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు.




Next Story

Most Viewed