రాజగోపాల్ రెడ్డిని పార్టీనే బయటకు గెంటేసింది: బీజేపీ ఎంపీ

by Disha Web Desk 2 |
రాజగోపాల్ రెడ్డిని పార్టీనే బయటకు గెంటేసింది: బీజేపీ ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీనే బయటకు గెంటేసిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి మూడు టికెట్లు అడిగాడని స్పష్టం చేశారు. త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని.. కాంగ్రెస్‌లో గెలిచిన వారెవరూ అందలో ఉండరని అన్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ ఓడిపోతారని తెలిపారు. తాను పోటీ చేస్తున్న కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కవిత ప్రచారం చేసి.. తనను ఓడిస్తానని అంటోంది. కవిత ప్రచారం చేస్తే బీజేపీకే మంచిదని ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed