వెంటనే తెలంగాణ వదిలి వెళ్లిపో.. వైఎస్ షర్మిలకు సొంత నేతల BIG షాక్

by Disha Web Desk 2 |
వెంటనే తెలంగాణ వదిలి వెళ్లిపో.. వైఎస్ షర్మిలకు సొంత నేతల BIG షాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అంశంతో వైఎస్సార్టీపీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని పెట్టి కార్యకర్తలను నమ్మించి మోసం చేసిన షర్మిల వెంటనే తెలంగాణ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆ పార్టీ నేతలు గో బ్యాక్ అని డిమాండ్ చేశారు. ఆంధ్ర స్థానికత కలిగిన షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మూకుమ్మడిగా ఆ పార్టీ నుంచి రాజీనామా చేసిన నేతలు ఆమెకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. గట్టు రామచంద్రరావు, సత్యవతి, సంజీవరావు, గణేశ్ నాయక్ తదితరులంతా సామూహికంగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్‌కు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మంచి పేరును ఆమె చెడగొట్టారని ఆరోపించారు. పార్టీ నుంచి రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను మీడియాకు వివరించారు.

ఇంతకాలం ఆమెను నమ్మి ఆమె వెనక నడిచి సపోర్టు చేసినందుకు సిగ్గుగా ఉన్నదని, ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి వస్తున్నదని పేర్కొని సారీ చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్టీపీకి రాజీనామా చేసినందున ఆమెను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నామన్నారు. ఆమె రాజకీయాలకు పనికిరాని వ్యక్తి అని, తెలంగాణ పట్ల ఆమెకు చిన్నచూపు ఉన్నదన్నారు. తమ భవిష్యత్ కార్యచరణను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. మహిళలకు ప్రాధాన్యతిస్తామంటే పార్టీలో చేరానని, ఆమెతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నానని, కానీ ఆమె తన సొంత ఎజెండాను పెట్టుకున్నారని, భవిష్యత్తులో ఆమె ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామన్నారు.

బయ్యారం గుట్టను దోచుకోవడానికి వచ్చిన షర్మిలా ఖబడ్దార్.. అంటూ ఆమెకు గణేశ్ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ సొమ్ము దోచుకోడానికే ఆమె ఇక్కడకు వచ్చారని, ఇప్పుడు ఎన్నికల బరి నుంచి తప్పుకున్న ఆమెను భవిష్యత్తులో ఎక్కడ పోటీ చేసినా రాళ్ళతో కొట్టి ఆంధ్రకు పంపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ద్రోహిగా ఆమెకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఇకపైన ఆమెకు తెలంగాణలో తిరిగే హక్కే లేదన్నారు.

Next Story

Most Viewed