తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు

by Disha Web Desk 2 |
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అన్నివర్గాల ప్రజల్ని ఆకట్టుకునేలా ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో కమలం పార్టీ మేనిఫెస్టోను తయారు చేసింది. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయని.. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ గ్యారంటీ ఇస్తున్నారన్నారు అమిత్ షా. ఈ 9 ఏళ్లల్లో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని మోడీ ఇప్పటికే ప్రకటించారని అమిత్ షా గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాలకు 3 వందేభారత్‌ రైళ్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామని హామీ ఇచ్చారు.



Next Story

Most Viewed