రాహుల్ గాంధీని కలిసిన మైనంపల్లి, వేముల వీరేశం

by Disha Web Desk 2 |
రాహుల్ గాంధీని కలిసిన మైనంపల్లి, వేముల వీరేశం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. మల్కా్జ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి థాక్రేతో పాటు పలువురు శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి రాహుల్ శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి, వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలని సూచించారు. కాగా, నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మైనంపల్లి, వేముల వీరేశం హస్తం తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.



Next Story