మంత్రి కేటీఆర్‌కు ఎంపీ అర్వింద్ మూడు ప్రశ్నలు

by Disha Web Desk 2 |
మంత్రి కేటీఆర్‌కు ఎంపీ అర్వింద్ మూడు ప్రశ్నలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ ఇవాళ ‘మోడీజీ ఆ 3 హామీల సంగతేంది అని ఎంతకాలం ఈ అబద్ధాల జాతర’ అంటూ ప్రధానిని ప్రశ్నించారు. దీనిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అబద్దాల పుట్ట.. ట్విట్టర్ పిట్ట అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. ‘1. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి 8 ఏండ్ల నుంచి జాగ ఇవ్వకుండా ఏ మత్తుల ఉన్నవ్? 2. పాలమూరు మాత్రమే కాదు, కాళేశ్వరానికి కూడా డీపీఆర్ ఇవ్వమంటే 5 ఏండ్ల నుంచి ఇవ్వకుండా ఏడ జోగుతున్నవ్..? 3. పసుపు బోర్డు, మహిళా రిజర్వేషన్‌లు ఎన్నికల స్టంట్‌లు అంటివి కదా, మరి నీ చెల్లెందుకు చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకుంది బిల్లు పాసైనంక!?’ అంటూ కేటీఆర్‌‌ను ప్రశ్నించారు. ‘ముందు మీ ముగ్గురు కుటుంబ సభ్యులు మత్తులో కాకుండా, ఒక్కసారన్నా తెలివికొచ్చి సమన్వయపరచుకోండి.. ఎప్పుడొస్తయ్.. ఎప్పుడొస్తయ్ అని ఊగుతున్నవ్ కదా!.. మీ కుటుంబానికి రాజకీయ గత్తరొచ్చినప్పుడు అన్నొస్తయ్’ అంటూ విమర్శించారు.



Next Story

Most Viewed