ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేము చెప్పినట్లే వినాలి.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మేము చెప్పినట్లే వినాలి.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ పార్టీ బలంగా ఉన్నా.. అధికారంలో కూర్చొబెట్టేది మాత్రం తామే అని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి కేసీఆర్ వరకు అందరితోనూ పనిచేయించామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా లేదని.. అందుకే ఇతర పార్టీల లీడర్లను తెచ్చి నింపుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పార్టీలు మారి కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయ్యాడని ఎద్దేవా చేశారు.

మొదట ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన రేవంత్.. ఆ తర్వాత తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్ చేరారని విమర్శించారు. తాము లోకల్ అని, తమకు ఎవరి సపోర్ట్ అవసరం లేదని, మా వెంట ఆ దేవుడే ఉన్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. తమపై ఎవరెన్నీ విమర్శలు చేసినా పట్టించుకోమని.. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరమూ లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఏ పార్టీ అధికాంలోకి వచ్చినా తాము చెప్పినట్లే వినాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఉన్నా.. ముస్లింల అభివృద్ధికి పాటుపడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు.


Next Story