టార్గెట్ కాంగ్రెస్.. హైదరాబాద్‌లో మరోసారి IT రెయిడ్స్ కలకలం

by Disha Web Desk 2 |
టార్గెట్ కాంగ్రెస్.. హైదరాబాద్‌లో మరోసారి IT రెయిడ్స్ కలకలం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల గడువు ముంచుకొస్తున్న వేళ తెలంగాణలో ఐటీ, ఈడీ రెయిడ్స్ సంచలనంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లపై దర్యాప్తు సంస్థలు గురిపెట్టగా తాజాగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడిపై ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కొండాపూర్ లో గల మనోహర్ రెడ్డి సోదరుడి నివాసంలో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. కాగా మనోహర్ రెడ్డిసోదరుడికి రంగారెడ్డి జిల్లా తాండూర్ ప్రాంతంలో ఆర్బీఎల్ ఫ్యాక్టరీ ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల లెక్కలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ రెయిడ్స్ కు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story