స్పీడ్ పెంచిన సీపీఎం.. ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి

by Disha Web Desk 2 |
స్పీడ్ పెంచిన సీపీఎం.. ప్రచారానికి మాజీ ముఖ్యమంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణాలో మరో వారంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలో తమ సత్తా చాటాలని సీపీఎం పట్టుదలతో ఉంది. పోలింగ్ సమయం దగ్గరపడటంతో ప్రచారాన్ని మరింత ఉధృతం చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునేలా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సీపీఎం అగ్రనేతలను రాష్టానికి రప్పించి వారితో ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, పాలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషినీ ఆలీ మూడు రోజులపాటు ప్రచారం నిర్వహించనున్నారు.

నేడు ఖమ్మంలో రోడ్ షో అలాగే మధిర నియోజకవర్గం ముదిగొండలో సభ, శనివారం భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడులో పర్యటించి సాయంత్రం భద్రాచలంలో రోడ్ షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 26న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషినీ అలీ నేడు జనగాం నియోజకవర్గంలో పర్యటించి , సాయంత్రం హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల పర్యటనలో ప్రసంగించనున్నారు.


Next Story