సీపీఎం అభ్యర్థులను అసెంబ్లీకి పంపించండి: తమ్మినేని

by Disha Web Desk 2 |
సీపీఎం అభ్యర్థులను అసెంబ్లీకి పంపించండి: తమ్మినేని
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సీపీఎం ఫస్ట్ లిస్ట్ విడుదల తర్వాత తమ్మినేని మీడియాతో మాట్లాడారు. మూడు నినాదాలతో ప్రజల ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. 1. సీపీఎం అభ్యర్థులను అసెంబ్లీకి పంపించండి. 2. సీపీఎం వామపక్షాల అభ్యర్థులను బలపర్చండి. 3. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం. అనే నినాదాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తాము బరిలో లేని స్థానాల్లో బీజేపీని ఓడించగల పార్టీలకు మద్దతు ఇస్తామని అన్నారు. అంతేకాదు.. సీపీఐ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎం పోటీ చేయబోదు అని తేల్చి చెప్పారు. సీపీఎం అభ్యర్థులను, మేనిఫెస్టోను ప్రజలు ఆదరించాలని కోరారు. నిన్న సీపీఐ నేతలు తమను కలిసి కాంగ్రెస్‌తో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed