కొత్తగూడెంలో CPI పోటీ.. కాంగ్రెస్ గెలిచాక 2 ఎమ్మెల్సీలు

by Disha Web Desk 2 |
కొత్తగూడెంలో CPI పోటీ.. కాంగ్రెస్ గెలిచాక 2 ఎమ్మెల్సీలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐతో కాంగ్రెస్ జరిపిన చర్చలు ఎట్టకేలకు సఫలం అయ్యాయి. కొత్తగూడెం టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు కూడా ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని ఓడించేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎమ్ఐఎమ్ మూడు పార్టీలు ఒక్కటే అని విమర్శించారు.

Next Story

Most Viewed