నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు చూడలే: వీహెచ్

by Disha Web Desk 2 |
నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు చూడలే: వీహెచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ నేతలపై కక్ష పూరితంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ నేతలపై తనిఖీలు చేస్తున్న దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఎందుకు సోదాలు జరపడం లేదని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలలో డబ్బులు ఉన్న వారు లేరా అని నిలదీశారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లమీద ఐటీ రెయిడ్స్ చేయడంతో పాటు వారి ఉద్యోగులపై థర్డ్ డిగ్రీ చేశారని మండిపడ్డారు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు చూడలేదన్నారు.

అమిత్ షా పని గట్టుకుని ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సృజనా చౌదరి, సీఎం రమేష్ లు టీడీపీలో ఉన్నప్పుడు కేసులు వేశారు. వారు బీజేపీలో చేరగానే క్లీన్ చీట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్, ఏపీకి స్పెషల్ స్టేటస్ లపై కొట్లాడిన పవన్ కళ్యాణ్ తిరిగి బీజేపీ వైపు చేరడంపై పునరాలోచన చేయాలన్నారు. ఇండియా కూటమిలో నితీష్ కుమార్, శరత్ పవార్, మమతా, స్టాలిన్‌లు రాహుల్‌కు మద్దతుగా ఉన్నారని ఈసారి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు.

Next Story