రేవంత్ కంటే కేసీఆరే మంచోడు.. బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్

by Disha Web Desk 2 |
రేవంత్ కంటే కేసీఆరే మంచోడు.. బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆరే మంచోడని అర్వింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో హంగ్ ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. అయితే, ఎప్పడు కేసీఆర్‌ను విమర్శించే అర్వింద్ సడన్‌గా కేసీఆర్ మంచోడని కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ గట్టిగా ఉందని ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ కంటే కేసీఆర్ బెటరని అర్వింద్ వ్యాఖ్యానించడంపై బీజేపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.



Next Story