‘భట్టి అన్నా బాగున్నారా’.. డిప్యూటీ సీఎంతో YS షర్మిల భేటీ

by Disha Web Desk 19 |
‘భట్టి అన్నా బాగున్నారా’.. డిప్యూటీ సీఎంతో YS షర్మిల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన వైఎస్ షర్మిల ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఇవాళ ఉదయం ప్రజాభవన్‌కు వెళ్లిన షర్మిల భట్టి అన్నా బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు. అయితే షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలోనే షర్మిల భట్టితో మర్యాదపూర్వకంగా కలిశారు. పెళ్లికి రావాలని వివాహ పత్రికను అందజేశారు.

Next Story

Most Viewed