తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం ఇదే.. షర్మిల క్లారిటీ

by Disha Web Desk 2 |
తెలంగాణలో పార్టీ పెట్టడానికి కారణం ఇదే.. షర్మిల క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం హస్తం ఉందన్న వార్తలపై షర్మిల స్పందిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణగా మార్చుతున్నానని చెప్పుకొంటున్న సీఎం కేసీఆర్‌ బీర్ల తెలంగాణగా మారుస్తున్నారని, మద్యం ధరలు పెంచడం, గ్రామాల్లో బెల్టుషాపులకు అనుమతులివ్వడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం, జోగులంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మీదుగా ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గుడి, బడి కన్నా వైన్‌షాపులే మిన్న అన్న నినాదాన్ని బలపరుస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకే వైఎస్సార్‌టీపీ స్థాపించానని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తానని హామీఇచ్చారు.

Next Story

Most Viewed