ఆ పేరు చెబుతేనే సీఎం కేసీఆర్ వణుకు: YS షర్మిల ఫైర్

by Disha Web Desk 19 |
ఆ పేరు చెబుతేనే సీఎం కేసీఆర్ వణుకు: YS షర్మిల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ లీకేజీలో సిట్ దర్యాప్తు కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేశామని చెప్తున్న సిట్ పాత్రధారులను మాత్రమే దోషులుగా చూపెడుతూ.. సూత్రధారులకు క్లీన్ చిట్ ఇచ్చే పనిలో పడిందని సిట్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రగతి భవన్ డైరెక్షన్ లోనే సాగుతున్న దర్యాప్తులో తెరవెనుక ఉన్న అసలు దొంగలను దాచిపెడుతున్నారని ఆమె ఆరోపించారు. పేపర్ లీకులు దేశాలు దాటిపోయినా పట్టింపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. బోర్డు సభ్యుల్లో ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదని షర్మిల పేర్కొన్నారు.

కనీసం కాన్ఫిడెన్షియల్ అధికారిని కూడా బాధ్యతల నుంచి తప్పించలేదన్నారు. దర్యాప్తు ముగిసే వరకు బోర్డు సభ్యులపై కనీసం నిఘా కూడా పెట్టలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్ లీకుల్లో కేవలం ఉద్యోగులు మాత్రమే ఉంటే సీబీఐ దర్యాప్తునకు కేసీఆర్ అండ్ బ్యాచ్‌కి భయమెందుకని ఆమె ప్రశ్నించారు. సీబీఐ పేరు చెబితేనే ఆయనకు వణుకు పుడుతుందంటే అసలు దొంగలు ప్రగతి భవన్ లోనే ఉన్నట్లే కదా అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పేపర్ లీకులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని, టీఎస్ పీఎస్సీ ప్రస్తుత బోర్డును తక్షణమే రద్దుచేసి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story