అమ్మా లే అమ్మా.. మూడు రోజులుగా తల్లిసమాధి వద్దే

by Ajay Maddhiboyina |

కరీంనగర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడు రోజులుగా ఓ యువతి తల్లి సమాధి వద్దనే ఉంటోంది. పగలూ రాత్రి తేడా లేకుండా కరీంనగర్ కబరస్తాన్ స్మశానంలోనే ఉంటోంది.

అమ్మా లే అమ్మా.. మూడు రోజులుగా తల్లిసమాధి వద్దే
X

దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మూడు రోజులుగా ఓ యువతి తల్లి సమాధి వద్దనే ఉంటోంది. పగలూ రాత్రి తేడా లేకుండా కరీంనగర్ కబరస్తాన్ స్మశానంలోనే ఉంటోంది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం తల్లి మరణించగా అమ్మా లే అని ఏడుస్తూ తల్లిమరణాన్ని జీర్ణించుకోలేకనే యువతి అక్కడ ఉంటోందని తెలుస్తోంది. కుటుంబ సభ్యలు ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వెళ్లట్లేదని సమాచారం. దీంతో షీటీమ్స్, సఖి టీం, మహిళా సంక్షేమ అధికారులు స్పందించి యువతికి రక్షణ, వైద్యం అదించాలని మానవతావాదులు కోరుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. VIDEO

Next Story