- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాగ్యనగరంలో దారుణం.. మటన్ కొట్టే కత్తితో ప్రియుడి హత్య.. మూటగట్టి తరలిస్తుండగా..
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల చింతల్ అంబేడ్కర్ నగర్లో ఒక దారుణ హత్య కలకలం రేపింది.

దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల చింతల్ అంబేడ్కర్ నగర్లో ఒక దారుణ హత్య కలకలం రేపింది. పదేళ్లుగా తనతో కలిసి ఉంటున్న వ్యక్తిని, ఒక మహిళ తన కుమారుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సహజీవనం.. వేధింపులే కారణమా?
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి (40) అనే వ్యక్తి, అంబేడ్కర్ నగర్లో నివాసం ఉంటున్న ఒక మహిళతో గత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళ కుమారుడు కూడా వీరితోనే కలిసి ఉంటున్నాడు. అయితే.. కొంతకాలంగా శివారెడ్డి ఆ మహిళను మరియు ఆమె కుమారుడిని తీవ్రంగా వేధిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. శివారెడ్డి వేధింపులు భరించలేకపోయిన తల్లి, కుమారుడు అతడిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి గొడవ ముదరడంతో, పక్కా పథకం ప్రకారం మటన్ కొట్టే కత్తితో శివారెడ్డిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
మృతదేహం తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
హత్య అనంతరం మృతదేహాన్ని మాయం చేసేందుకు అర్ధరాత్రి సమయంలో ఒక సంచిలో మూటగట్టారు. ఆ మూటను బయట ఎక్కడైనా పారేయాలని ప్రయత్నిస్తుండగా, గస్తీలో ఉన్న జీడిమెట్ల పోలీసులు వారిని గమనించారు. అనుమానం వచ్చి వారిని ఆపి తనిఖీ చేయగా, సంచిలో రక్తంతో ఉన్న మృతదేహం బయటపడటంతో పోలీసులు షాక్కు గురయ్యారు. తల్లిని, కుమారుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చింతల్ వంటి రద్దీ ప్రాంతంలో మృతదేహాన్ని మూటగట్టి తరలించేందుకు ప్రయత్నించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.






