- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రస్తుత ప్రభుత్వ పథకాలను ఆపబోం.. అన్ని అలాగే కొనసాగిస్తాం.. పవన్ కీలక వ్యాఖ్యలు
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: రానున్న ఎన్నికల్లో ఏర్పడబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ప్రస్తుతం అమలు అవుతున్న ప్రతి పథకాన్ని కొనసాగిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. ఇప్పుడు కొనసాగుతున్న పథకాలకు అదనంగా డబ్బు జోడించి ఇస్తామని, ఏ పథకాన్ని రద్దు చేయబోమని పేర్కొన్నారు. కావాలంటే తన వ్యక్తిగత సంపాదనను కూడా ప్రజలకు పంచేందుకు సిద్ధమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు న్యాయం జరగలేదని ఆరోపించారు.
Next Story