విషాదంగా ముగిసిన యువకుడి అదృశ్యం

by Bhanu |

కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటకి వచ్చిన యువకుడు అదృశ్యమైన సంఘటన తెలిసిందే.

విషాదంగా ముగిసిన యువకుడి అదృశ్యం
X

దిశ, డోర్నకల్: కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటకి వచ్చిన యువకుడు అదృశ్యమైన సంఘటన తెలిసిందే. సిఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణం రామచంద్ర పురానికి చెందిన ఉల్లి రాకేష్ (26)కుటుంబ సభ్యులతో కలిసి రావిగూడెం వచ్చారు. ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు జరిపారు. బుధవారం ములకలపల్లి సమీప పాండవుల గుట్ట వద్ద రాకేష్ మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Next Story