స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో వరంగల్ యువతి మృతి

by Disha Web Desk 18 |
స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో వరంగల్ యువతి మృతి
X

దిశ, దుగ్గొండి: స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో వరంగల్ జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. ఐదవ అంతస్తులో ఉన్న ఈ కామర్స్ కాల్ సెంటర్ సంస్థలో పనిచేస్తున్న వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ రవి కుమార్తె వంగ వెన్నెల నిన్న జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్ అగ్నిప్రమాదంతో సంభవించిన దట్టమైన పొగతో ఊపిరాడక అర్ధరాత్రి మృతిచెందింది. వెన్నల గత మూడు సంవత్సరాలుగా ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తుంది. కుటుంబానికి ఆసరాగా ఉండాలని ఉద్యోగం చేస్తున్న వెన్నెలను అగ్ని ప్రమాదం రూపంలో మృత్యువు కబలించించింది. ఒక్కగానొక్క కుమార్తె మరణించడంతో రవి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.


👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story