పాము కాటుతో మహిళ మృతి..

by Disha Web Desk 11 |
పాము కాటుతో మహిళ మృతి..
X

దిశ, ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి: పాము కాటుతో మహిళ మృతి చెందిన ఘటన ఎల్కతుర్తి మండలం దండపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండపల్లి గ్రామానికి చెందిన మాచర్ల స్వప్న (40) ఆదివారం వరి కోతల నిమిత్తం పొలం పనులకు వెళ్లింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పాముకాటుతో గాయపడగా స్థానిక రైతులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. భర్త మల్లయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై జక్కుల పరమేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story