కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య..

by Taduka Kalyani |

కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని ముత్తారం గ్రామంలో జరిగింది.

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య..
X

దిశ, భీమదేవరపల్లి: కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని ముత్తారం గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన మోకిడి రత్నమ్మ (48), కుటుంబ కలహాలతో ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి భర్త గతంలో చనిపోగా, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Next Story