రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం: సీతక్క

by Disha Web Desk 11 |
రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం: సీతక్క
X

దిశ, కొత్తగూడ: నాడు రాజరికం వ్యవస్థపై సమ్మక్క సారలమ్మ, గుంజేడు ముసలమ్మ తల్లులు పోరాడిన స్ఫూర్తితోనే ఇప్పుడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం కొత్తగూడ మండల కేంద్రలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో పల్లె పల్లెకు కాంగ్రెస్, ఇంటింటికీ సీతక్క.. అంటూ హథ్ సే హథ్ జోడో యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఇది విజయవంతం కావాలని గుంజేడు ముసలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదయాత్రను ప్రారంభించి ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించారు.

కూరగాయల సెంటర్ లో కూరగాయలు అమ్మి పెరిగిన ధరలపై మండిపడ్డారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వాహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ని దెబ్బ తీయడానికి నాటకాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును రాజును చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాయ మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి చల్లా నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజాం సారంగం, గంగారం పార్టీ అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీలు పుల్సాం పుష్పలత శ్రీనివాస్, ఈసం రామ సురేష్, ఎంపీపీలు విజయ రూప్ సింగ్, సరోజన జగ్గారావు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మొగిలి, బిట్ల శ్రీను, కో ఆప్షన్ సభ్యలు సయ్యద్, సర్పంచ్ మల్లెల రణధీర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed