- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాదవశాత్తు బావిలో పడి వార్డు మెంబర్ మృతి..
ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని సూర్యాపేట తండాలో జరిగింది.

X
దిశ, నర్సంపేట: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని సూర్యాపేట తండాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తండాకి చెందిన దరావత్ మైబు (43) వార్డ్ మెంబర్, సోమవారం ఉదయం పొలం వద్దకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాడు. వేప పుల్ల కోసం బావి దగ్గరికి వెళ్లడంతో ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు సమాచారం. ఈ క్రమంలో బావిలోనే మైబు మృతి చెందాడు. మృతునికి భార్య సుజాత, కొడుకు, కూతురు ఉన్నట్లు తెలిసింది. మైబు మృతితో సూర్యాపేట తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.
Next Story






