వ‌రంగ‌ల్ సీపీ త‌రుణ‌జోషికి ఐజీగా ప‌దోన్నతి

by Web Desk |
వ‌రంగ‌ల్ సీపీ త‌రుణ‌జోషికి ఐజీగా ప‌దోన్నతి
X

దిశ‌, హ‌న్మకొండ టౌన్: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న తరుణ్ జోషికి ఐజీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఐజీగా పదోన్నతి పొందిన డా.తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఏప్రిల్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. డా.తరుణ్ జోషి హరియాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాగా, డెంటల్ డాక్టర్‌గా పట్టా పుచ్చుకొని ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. 2004 ఐపీఎస్ బ్యాచ్ చెందిన తరుణ్ జోషి శిక్షణ అనంతరం గోదావరిఖని ఏఎస్పీగా మరియు ఆదిలాబాద్ ఓఎస్డీగాను పనిచేశారు. 2009 మరియు 2010 సంవత్సరంలో వరంగల్ ఓఏస్డీగా పనిచేశారు. ఆ తర్వాత వైజాగ్ సీటీ ఎస్పీగా, గ్రేహౌండ్స్, నిజామాబాద్, హైదరాబాదు సెంట్రల్ జోన్, ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేశారు. డీఐజీ పదోన్నతిపై హైదరాబాదు స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ పనిచేసిన అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

Next Story

Most Viewed