నర్సంపేటలో డీజిల్ దొంగల హల్‌చల్

by Web Desk |
నర్సంపేటలో డీజిల్ దొంగల హల్‌చల్
X

దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో చమురు దొంగలు హల్‌చల్ చేశారు. డీజిల్ రేట్లు పెరగడంతో ఇది కూడా లాభసాటి భేరం అనుకున్నారో, జల్సాలకి డబ్బుల కోసం అందింది దోచేద్దాం అనుకున్నారో.. మొత్తానికైతే డీజిల్ ట్యాంకులను పగులగొట్టి చమురు చోరీకి తెగబడ్డారు. ఈ ఘటన నర్సంపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నర్సంపేట పట్టణంలోని త్రివేణి బాలికల కళాశాల ఎదురుగా బీటీ రోడ్‌పై ఆర్టీసీ బస్సులు నిలిపి ఉంచారు. గుర్తుతెలియని దొంగలు డీజిల్ ట్యాంకులను పగులగొట్టి డీజిల్ చోరీకి పాల్పడ్డారు. ట్యాంకులు ఒక్కొక్కటి 200 లీటర్ల సామర్థ్యం ఉండగా, రెండు బస్సుల నుండి మొత్తం 400 లీటర్ల డీజిల్ (సుమారు రూ.40,000/- విలువ) దొంగతనం జరిగినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ రామ్ చరణ్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, పట్టణంలో నడిరోడ్డుపై దొంగతనం జరుగడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Next Story

Most Viewed