విషాదం.. ఏస్అర్‌ఏస్పీ పెద్ద కెనాల్‌లో ఇద్దరు పిల్లలు గల్లంతు

by Disha Web Desk 12 |
విషాదం.. ఏస్అర్‌ఏస్పీ పెద్ద కెనాల్‌లో ఇద్దరు పిల్లలు గల్లంతు
X

దిశ, హనుమకొండ టౌన్ : కేయు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలివేల్పుల గ్రామ ఆమ్లెట్ గ్రామమైన కొత్తపల్లి అనే గ్రామానికి చెందిన మట్టేడ నరేష్ కుమారులు మట్టేడ హర్షిత్ (16), మట్టేడ అన్విక్ (9) ఏస్అర్‌ఏస్పీ పెద్ద కెనాల్‌లో బుధవారం ఈత కొట్టడం కోసం నీటిలో దిగి గల్లంతయ్యారు. నీటి ప్రవాహ వేగానికి ఇద్దరు కొట్టుకుని పోతుండగా అక్కడే బట్టలు ఉతుకుతున్న మహిళ చూసి అశోక్ అనే వ్యక్తి‌కి సమాచారం అందించారు. అతను వచ్చి చూడగా ఓ బాలుడి చేతులు మాత్రమే కనపడినట్లు తెలిపారు.

సమాచారం అందిన వెంటనే కేయూ పోలీసులు ఏసీపీ హన్మకొండ కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందిని, డీఆర్ఎఫ్ టీమ్ వచ్చి బృందాలుగా ఏర్పడి నీటిలో దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అన్ని విభాగాలా సమన్వయముతో గాలింపు చర్యలు చేపడుతున్నామని అన్నారు. సాధ్యమైనంత తొందరగా పిల్లల ఆచూకీ కనిపెడతామని తెలిపారు.



Next Story

Most Viewed