అనుమాదాస్పస్థితిలో యువకుడు మృతి

by Dishanational2 |
అనుమాదాస్పస్థితిలో యువకుడు మృతి
X

దిశ, రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన మినుముల మాధవరెడ్డి అలియాస్ చందర్ రెడ్డి (45) సోమవారం ఉదయం వెల్ది శివారులోని బొగ్గు ఉత్పత్తి కర్మాగారంలో అనుమాదాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతని మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడు ఏడాది క్రితం జరిగిన ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఇతనికి భార్య, కూతురు ఉన్నారు. ఇతను ఇటీవల బెయిల్ పై వచ్చి వెల్డి గ్రామ శివారులోని బొగ్గు ఉత్పత్తి కర్మాగారంలో పనిచేస్తున్నాడు.

అయితే, సోమవారం 8:30 గంట ప్రాంతంలో విద్యుత్ షాక్కు గురై మరణించినట్లు అనుమానిస్తున్నారు. రఘునాథపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనామా అనంతరం శవాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసిపి రఘు చందర్ తెలిపారు. ఇతని మృతికి గల కారణాలు పోస్ట్ మార్టంలో తేలుతాయని పోలీసు భావిస్తున్నారు. మృతుడు హత్య కేసులో నిందితుడు కావడంతో ఈ ఘటన దావణంలో వ్యాపించి మండలంలో చర్చారి అంశం వ్యాపించి చర్చాల్సిన మారింది.



Next Story

Most Viewed