- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, కొత్తగూడ : మండలములోని ఓటాయీ ప్రాంతంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి మొక్కజొన్న పంటలు నేలమట్టం అయ్యాయి. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వృధా అయ్యి అప్పుల పాలు అవుతున్నామనీ అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓటాయి రేణ్యా తండాకు చెందిన రాములుతో పాటు మరికొందరి రైతుల దాదాపు 50 ఎకరాల మొక్క జొన్న పంట నేల మట్టం అయ్యింది. ఖరీఫ్ సీజన్ లో కురిసిన వర్షాలకు ఎంతో ఆశతో పంటలు పండించేందుకు అప్పులు తెచ్చి మరీ పంటలు వేస్తే కురిసిన భారీ వర్షానికి నేల మట్టం అయ్యి రైతు కంట కన్నీరు పెట్టిస్తుంది.
- Tags
- Telug News
- rains
Next Story






