ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

by Disha Web Desk 13 |
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ నెల గర్భిణీ స్త్రీలు ఎంతమంది కాన్పు కోసం ఉన్నారో వైద్యాధికారి ని అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఆసుపత్రులలో ప్రసవాలు గురించి ఆరా తీశారు. ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన సేవలు అందించడానికి ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలను, మాత, శిశు సంరక్షణ సేవలు, కుటుంబ నియంత్రణ, సాధారణ ప్రసవాల పట్ల అవగాహన పెంచుతూ, ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను పెంచాలని వైద్యాధికారిణిని ఆదేశించారు. ఆసుపత్రికి ప్రతిరోజు రోగులు ఎంతమంది వస్తున్నారు. ఇన్ పేషంట్స్ వారి గురించి వాకబు చేశారు. తదుపరి ఫార్మసీ స్టోర్ ఇన్ స్పెక్షన్ చేయడం జరిగింది.

అత్యవసర మందుల నిల్వలు సరిగా మైంటైన్ చేయాలని, అలాగే కుక్క కాటు, పాము కాటు మందులు ఎల్లప్పుడు ఉంచుకోవాలని ఫార్మసిస్ట్‌ను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆస్పత్రికి ప్రహరీ గోడ ఏర్పాటు కోసం, త్రాగునీరు సౌకర్యం బోరు ఏర్పాటు కోసం కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది వైద్యాధికారి డాక్టర్ స్వప్న, సమ్మయ్య హెచ్‌ఇఓ, శివరంజని ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ శ్రీలేఖ, శ్రీధర్ ఎల్‌టి విధులలో పాల్గొన్నారు.



Next Story

Most Viewed