నీటి తొట్టిలో పడి బాలుడు మృతి..

by Disha Web Desk 11 |
నీటి తొట్టిలో పడి బాలుడు మృతి..
X

దిశ, గార్ల: ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గార్ల మండలం సీతంపేట గ్రామపంచాయతీ పరిధి చవిటి తండాలో గుగులోత్ వీరన్న, బేబీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. కాగా కుమారుడు గుగులోత్ శుశాంత్ కుమార్ (4) ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడిపోయి చనిపోయాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్టుమార్టం నిర్వహించి సోమవారం అంతక్రియలు చేసినట్లుగా ఎస్ఐ బానోత్ వెంకన్న తెలిపారు.

Next Story

Most Viewed