దాత సహకారంతో గ్రామ పంచాయతీకి స్వర్గరథం

by Nallavelli.Anjaneyulu |

మండ‌లంలోని శాయంపేట గ్రామంలో స్వ‌ర్గ‌రథ మ‌ర‌మ్మ‌తులకు రూ.50వేలు విరాళం అంద‌జేశారు.

దాత సహకారంతో గ్రామ పంచాయతీకి స్వర్గరథం
X

దిశ, గీసుకొండ : మండలంలోని శాయంపేట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న స్వర్గరథ మరమత్తులు కోసం అదే గ్రామానికి చెందిన వాస్తవ్యులు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సముద్రాల యాకస్వామి ముందుకు వచ్చి రూ 50 వేలు విరాళాన్ని గ్రామ సర్పంచ్ గాలి యాకయ్యకు అంద‌జేశారు. దీంతో స్వర్గ ర‌థాన్ని మరమత్తులు చేపించారు. ఈ సందర్భంగా సముద్రాల యాకస్వామి ని గ్రామ ప్రజలు అభినందించారు.నేటి నుంచి గ్రామపంచాయితిలో స్వర్గ రథం అందుబాటులోకి రావడం జరుగుతుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అనిత, కాంగ్రెస్ నాయకులు దూల రమేష్, దాడి శివ పాల్గొన్నారు.

Next Story