Breaking: మేడారం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం

by Web Desk |
Breaking: మేడారం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం
X

దిశ, ములుగు: మేడారం మహా జాతరకు వెళ్లి వస్తుండగా జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో భారీగా భక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదాలు ములుగు జిల్లాలో గురువారం చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ వద్ద మేడారం వెళ్లి వస్తున్న భక్తుల టాటా మ్యాజిక్ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఎనిమిది మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడినవారిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతేగాక, ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా మేడారం భక్తులు వస్తున్న ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన భక్తులందరికీ చికిత్స జరుగుతోంది.


Next Story

Most Viewed