వడగండ్ల తాకిడి తట్టుకోలేక బావిలో పడి గొర్రెలు మృతి

by Dishanational1 |
వడగండ్ల తాకిడి తట్టుకోలేక బావిలో పడి గొర్రెలు మృతి
X

దిశ, దుగ్గొండి: వడగండ్ల తాకిడిని తట్టుకోలేక గొర్రెలు బావిలో పడి మృతువాత పడిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం గొర్ల కాపరులు కాస లింగయ్య, ఐలుకొంరులు వారి వ్యవసాయ బావి వద్ద రాత్రి గొర్రెల మంద పెట్టుకుని నిద్రిస్తున్న క్రమంలో శనివారం అర్ధరాత్రి కురిసిన అకాలవర్షంతో కురిసిన వడగండ్ల తాకిడిని తట్టుకోలేక మందలో ఉన్న కొన్ని గొర్రెలు వెళ్లి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి మృత్యువాత పడ్డాయి.


Next Story

Most Viewed