బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు నివేదిక

by velandi.Saikiran |

42 శాతం బిసి రిజర్వేషన్ల అంశంపై బిల్లులో ఉన్న లోపాల వివరాల నివేదికను బీసీ కమిషన్ చైర్మన్ కు అందజేశారు బీసీ

బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు నివేదిక
X

దిశ, హన్మకొండ టౌన్: 42 శాతం బిసి రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులో ఉన్న లోపాలు, సవాళ్లు, సమస్యలపై వివరాల నివేదికను బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కు అందజేశారు బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డా తిరునహరి శేషు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. తమిళనాడులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతోనే 69 శాతం రిజర్వేషన్ సాధించాయనే విషయాన్ని కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

రిజర్వేషన్ల సాధనలో ఒక సుదీర్ఘ చట్ట రాజ్యాంగ న్యాయ ప్రక్రియ ఇమిడి ఉందని తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఎంబిసి కార్పొరేషన్ తరహాలోనే సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ రిజర్వేషన్ల సాధనకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకొని రిజర్వేషన్ల సాధనకు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

Next Story